ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం వలన కలిగే ఫలితాలు
ఈ పన్నెండు జ్యోతిర్లింగాలను చూసినా, తాకినా మరియు పూజించినా తలచినా మానవుల యొక్క ఇహపర సుఖాలను పొందుతారని శాస్త్ర వచనం చెపుతోంది .
1 . సౌరాష్ట్ర దేశంలో చంద్రనిర్మితమైన, అయన పేరుతోనే అలరారుతున్నకుండంలో స్నానంచేసి, అక్కడ సోమనాథ జ్యోతిర్లింగాన్ని భక్తిశ్రద్ధలతో ఆరాధించిన వాళ్ళు కుష్ఠాపస్మారక్షయాది రోగవిముక్తులై ఆయురారోగ్యాలతో మరియు భోగభాగ్యాలతో జీవిస్తారు.
2 . ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలంలో మల్లిఖార్జుననామంతో వెలసిన శివుడి జ్యోతిర్లింగారాధన వలన సర్వవిధ దరిద్రాలు పోయి, సద్యశ్శుభాలేర్పడి, అనంతరం మోక్ష పదం కూడా కలుగుతుంది.
3 . ఉజ్జయిని ‘మహాకాల’ నామకమైన జ్యోతిర్లింగార్చనవలన భయ రాహిత్యం మరియు విద్యాపాటవం, భోగభాగ్యాలూ సమకూరి అన్నింటా విజయం పొందుతారు .
4 . అమరేశ్వర, పరమేశ్వర, ఓంకారేశ్వారాది సార్థకనామధేయలాతో ఓంకారేశ్వారంలో వెలసిన శివుడి జ్యోతిర్లింగాన్ని పూజించడం వలన ఇహపరాలు రెండింటా కృతార్థత కూడా లభిస్తుంది.
ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం వలన కలిగే ఫలితాలు
5 శ్రీహరియొక్క రెండు అంశలైన నరనారాయణుల ప్రార్థనతో ఆవిర్భవించిన జ్యోతిర్లింగం హిమవత్పర్వతం మీద వుంది . కేదారేశ్వరుడిగా పేరు వహించిన ఇక్కడి లింగారాధన సర్వాభిష్టాలనూ నెరవేరుస్తుంది. ఇక్కడి రేతః కుండంలోని నీళ్ళతో మూడుసార్లు ఆచమించడమే ముక్తికి చేరువ మార్గమని ముని వాక్యం ఉంది .
6 . ఢాకిని అనే ప్రదేశంలో ఉన్న జ్యోతిర్లిగం పేరు భీమశంకరలింగం. ప్రాణావసానుడై ఉన్న భక్తుడి రక్షణార్థమై వెలసిన ఈ లింగారాధన వలన అన్ని విధాల భయాలూ పోయి శత్రుజయం కలుగుతుంది. అకాలమృత్యువులు కూడా తప్పిపోతాయి.
7 . సర్వప్రపంచం చేత సేవించ బడుతూన్న విశ్వేశ్వరలింగం కాశీలో ఉంది. ఈ పుణ్యక్షేత్రము యొక్క దర్శన చేతేనే సమస్తమైన కర్మబంధాల నుంచీ విముక్తులౌతారు. ఇక్కడ కొన్నాళ్ళు నివసించినా, లేదా కాలవశాన ఇక్కడనే దేహం చాలించినవాళ్ళు మాత్రమే మోక్షాన్నే పొందుతారు.
8 . మహారాష్ట్ర నాసిక్ లో ఉన్న జ్యోతిర్లింగం పేరు త్రయంబకేశ్వర లింగం. దీని ఆరాధన వలన అన్ని కోరికలూ తీరుతాయి. అపవాదులు కూడా నశిస్తాయి.
ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం వలన కలిగే ఫలితాలు
9 . చితాభూమిలో ఉన్న జ్యోతిర్లింగం వైద్యనాథుడు. ఈ లింగారాధన వలన భుక్తి మరియు ముక్తులే కాకుండా అనేక విధాలైన వ్యాధులు హరించబడతాయని ఒక నమ్మకము .
10 . నాగేశ్వర జ్యోతిర్లింగం. ఈ లింగ దర్శనార్చనాడుల వలన సమస్తమైన భవభయాలే కాకుండా మరియు మహాపాతక లేదా ఉపపాతాకాలు కూడా నశించిపోతాయి.
11 . శ్రీరాముని కోరికమేరకు రామేశ్వరంలో జ్యోతిర్లింగంగా వెలిసిన శివుడు, రామేశ్వరుడనే పేరుతోనూనే రాజిల్లుతున్నాడు. కాశీలోని గంగా జలాన్ని తెచ్చి, ఇక్కడి లింగానికి అభిషేకం చేసిన వాళ్ళు జీవన్ముక్తులవుతారని ఒక నమ్మకము .
12 ‘ఘృష్ణేశ్వరుడు’. శివాలయమనే కొలనులో భక్తరక్షణార్థమై ప్రభవించిన ఈ స్వయంభూలింగం. భక్తుల యొక్క ఇలను అందజేస్తుంది.
No comments