త్రిమూర్తుల చిహ్నాలు వాటి యొక్క ప్రాముఖ్యత
హిందూ దేవుళ్లలో త్రిమూర్తులైన,బ్రహ్మ,విష్ణు మరియు మహేశ్వరులు అత్యంత ప్రసిద్ధి చెందిన దేవతలుగా ఉన్నారు. వారిలో బ్రహ్మ
సృష్టికర్త కాగా మరియు విష్ణువు సృష్టిని నడిపేవానిగా శివుడు సృష్టి నాశనకారిగా తమ విధులను కలిగి ఉన్నారు. శివునికి మరియు విష్ణు భగవానునికి చాలా దేవాలయాలు ఉన్నాయి కానీ బ్రహ్మ దేవుడికి మాత్రం ఒకే ఒక ఆలయం ఉంది. దీనికి గల కారణం కోపిష్టి
మరియు గర్విష్టి అయిన బృగుమహర్షి శాపంగా చెప్పబడినది. బృగు మహర్షి శాపం కారణంగా శివుడు లింగ రూపంలో పూజలు అందుకోవలసి వచ్చింది. బ్రహ్మ దేవునికి భూమి మీద గుడి లేని పరిస్థితి(అయినా కూడా ఒక ఆలయంఉంది)వచ్చినది . విష్ణువుకు
శాపం పెట్టలేదు కానీ, కాలితో తన్నిఅవమాన పరచిన కారణంగా విష్ణువుమూర్తి శ్రీనివాసుని అవతారం ధరించవలసివచ్చింది.
ప్రతి దేవునికి,దైవకార్యాలకై ఉద్దేశించబడిన వస్తువులు వారి చేతులలో కలిగి ఉంటాయి. అవేమిటో,వాటిప్రాముఖ్యతఏమిటో పూర్తిగా తెలుసుకుందాం.
త్రిమూర్తుల చిహ్నాలు వాటి యొక్క ప్రాముఖ్యత
బ్రహ్మ:
విశ్వం యొక్కసృష్టికర్త బ్రహ్మ.పుట్టుకే లేని నిరాకారునిగా బ్రహ్మనుపిలుస్తారు. స్వయంభూ అని కూడా పిలుస్తారు,అనగా తనకుతానే
జన్మించాడు. బ్రహ్మదేవుని భార్య సరస్వతి దేవి. ప్రపంచం మొత్తం మీద బ్రహ్మకు ఒకే ఒక్క ఆలయం ఉంది. అది కూడా రాజస్థాన్ రాష్ట్రంలోని , అజ్మీర్ జిల్లాలో పుష్కర్లో ఉంది. ఇక్కడ బ్రహ్మ దేవుడికి నాలుగు తలలు మరియు నాలుగు చేతులతో కనిపిస్తాడు . ఈ
నాలుగు తలలు హిందూ మతంలోని నాలుగు వేదాలను సూచిస్తాయి . నాలుగు చేతులలో వివిధములైన పవిత్ర వస్తువులను కలిగి
ఉంటాడు. ఆ వస్తువులు దేవునికి చెందిన కొన్ని ప్రత్యేక లక్షణాల యొక్క చిహ్నాలుగా కూడా ఉంటాయి. వీటికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నాలుగు ముఖాలు:
బ్రహ్మ యొక్క నాలుగు ముఖాలు ప్రధానంగా నాలుగు దిక్కులను కూడా సూచిస్తాయి. అతను సృష్టికర్త అనిపిలువబడుతాడు. అందుకని ఒకే సమయంలో విశ్వానికి నలువైపుల చూడగలిగేలా ఉంటాడు. తద్వారా బ్రహ్మ సృష్టికి సంబంధించిన అంశాలను పర్యవేక్షిస్తూ ఉంటాడు. అతని చేతులలో ఆయుధాలు కలిగి ఉండవు, ఎందుకంటే అతను సృష్టికర్త కాబట్టి . ఆయుధాలు నాశనం
చేయడానికి ఉపయోగిస్తారు.కాని సృష్టి కోసం కాదు. తన నాలుగు చేతులలో, వేదాలు, జపమాల మరియు దివ్యజ్యోతి లేదా తామర
పూవుని ఒక చేతిలో నీటి కమండలాన్ని కలిగి ఉంటాడు.
వేదాలు: విశ్వానికి మార్గదర్శకoగా వేదాలు వ్యవహరిస్తాయి.
జపమాల: జపమాల సమయాన్ని సూచిస్తుంది.
దివ్య జ్యోతి : భూమిపై నివసిస్తున్న జీవజాలానికి అగ్ని ప్రాముఖ్యతను సూచిస్తుంది.
కమండలo: జీవితానికి ప్రాధమిక వనరైన నీటి అవసరాన్ని నీటి కమండలo సూచిస్తుంది.
తామరపూవు: తామరపూవు మీద కూర్చున్న బ్రహ్మ దేవుడు, దేవుని వాస్తవిక ప్రతిరూపానికి అద్దంలా కూడా ప్రతిబింబిస్తుంది.
త్రిమూర్తుల చిహ్నాలు వాటి యొక్క ప్రాముఖ్యత
విష్ణు భగవానుడు :
విష్ణు భగవానుడు భూమి మీద ఉన్న జీవజాలాన్ని సృష్టిని మరియు రక్షిoచే భాద్యతలను కలిగి ఉన్నాడు. తద్వారా కేవలం విష్ణు భగవానుడు మాత్రమే జీవనాన్ని నియంత్రించగలిగే విధంగా ఉంటాడు. సృష్టిలో అధర్మాన్ని నాశనం చేసి మరియు ధర్మ సంస్థాపన కోసం ప్రతి యుగంలోనూ తన అవతారాలతో సృష్టిని కాపాడుతూ వస్తున్నాడు. ధర్మ సంస్థాపనలో భాగంగా తనకు అవసరమైన దైవ సంబంధిత వస్తువులను ఎల్లప్పుడూ కలిగి ఉంటాడు.
సుదర్శన చక్రం:
సుదర్శన చక్రం ఒక వృత్తాకార చక్రం. తన వేలు కొన వద్ద నిరంతరంగా తిరుగుతూ ఉంటుంది. ఇది భూమిపై జీవజాలాల కొనసాగింపును కూడా సూచిస్తుంది. ఇది ప్రకృతి భీభత్సాలను కూడా సూచిస్తుంది. ఈ చక్రం ఆరు కాలాలుగా కూడా విభజించబడింది. ఇది ఆరు ఋతువులకు చిహ్నంగా కూడా ఉంటుంది, తద్వారా సమయాన్ని కూడా సూచిస్తుంది. భూమిపై సూర్యుని శక్తి ప్రసరణను కూడా సూచిస్తుంది. విష్ణువు అత్యవసర సమయాల్లో మాత్రమే సుదర్శనాన్ని ప్రయోగిస్తాడు .
శoఖం:
జీవితం మీద ఆధారపడిన పంచ భూతాలను శంఖం సూచిస్తుంది. ఇవి నీరు, అగ్ని, గాలి మరియు భూమి ఆకాశం. విష్ణువు శంఖానికి ఉన్న మరొక పేరు పాంచజన్యం అంటారు . పాండవుల శoఖాలకు కూడా పేర్లు ఉన్నాయి. ధర్మరాజు శంఖాన్ని అనంత విజయమని మరియు అర్జునునిది దేవదత్తమని, భీమునిది పౌoడ్రకమని, నకులునిది సుఘోష అని మరియు సహదేవుని శంఖాన్ని మణిపుష్పకమని కూడా పిలుస్తారు.
గద : గద మానవాళికి హాని కలిగించే అన్ని అవాంఛిత అమానుష లక్షణాల నాశనాన్ని కూడా సూచిస్తుంది. ఇది మానసిక మరియు శారీరక బలానికి చిహ్నంగా కూడా ఉంది.
తామర పూవు : తామరపూవు స్వచ్ఛత మరియు నిజాన్ని కూడా సూచిస్తుంది. జాగృతం మరియు స్పృహలకు చిహ్నంగా ఉంటుంది.
త్రిమూర్తుల చిహ్నాలు వాటి యొక్క ప్రాముఖ్యత
పరమ శివుడు :
సృష్టి నాశనకారిగా పరమేశ్వరుని అభివర్ణిస్తారు. ఉనికిలోకి వచ్చే ప్రతి ఒక్క అంశం చివరికి నాశనం కావాలి. కాబట్టి, చావు మరియు పుట్టుకల చక్రాన్ని నియంత్రించే దేవునిగా పరమశివుడు . తద్వారా ప్రతి యుగాన్ని నాశనం చేసి మరియు నూతన యుగానికి శ్రీకారం చుట్టే దేవునిగా శివునికి భాద్యతలు ఉంటాయి. పరమశివుడి వర్ణనలో భాగంగా ముడిపడిఉన్న గుర్తులు.
చంద్ర వంక:
చంద్రవంకను నెలవంక అని కూడా అంటారు. ఇది సమయ చక్రాన్నికూడా సూచిస్తుంది. అంతేకాకుండా, వేదాలలో ఒక శ్లోకం ప్రకారం, చంద్రుడు మరియు రుద్రుడు ఇద్దరూ సృష్టి నాశనంలో కీలక పాత్ర కూడా పోషిస్తున్నారు.
త్రిశూలం :
త్రిశూలం మూడు గుణాలను సూచిస్తుంది – సత్వ, రాజ మరియు తమ. వేర్వేరు గుణాలు వేరు వేరు నిష్పత్తులలో ఉన్నాయి . వీటి మధ్య సమతౌల్య అవసరాన్ని కూడా సూచిస్తుంది.
డమరుఖం :
శివుడి యొక్క డమరుఖం తన నటరాజపు భంగిమ ప్రధాన గుణంగా కూడా చెప్పబడింది. ఓంకారం మరియు ప్రమదగణాలకు పుట్టినిల్లుగా ఈ డమరుఖం కూడా ఉంది.
పాము:
శివుడు అంటేనే మెడలో పాము కనిపింస్తుంది . పాము ప్రమాదాలను కూడా సూచిస్తుంది. శివుడు ఎటువంటి ప్రమాదాన్నైనా తట్టుకోగలడు మరియు పరమేశ్వరుడు వాటిని అన్నిటినీ అధిగమించే శక్తిని కూడా కలిగి ఉన్నాడు. విషమును మింగి గరళ కంఠునిగా మారిన శివునికి మెడలో పాము అలంకార ప్రాయమే . ఎటువంటి ప్రమాదాలతో అయినా ఆడుకోగలడని చెప్పకనే చెప్తున్నట్లు ఉంటుంది.
No comments