ఏ వారం ఏ పూజిస్తే కలిగే ఫలితాలు
కొంతమంది భక్తులు ఎప్పుడు ఏ దేవుడికి పూజ చేస్తే ఎలాంటి పుణ్యఫలితం దక్కుతుందో తెలిస్తే కచ్చితంగా ఆ పూజ మాత్రమే చేసుకుని త్వరగా ఫలితాన్ని పొందాలనుకుంటుంటారు. అలాంటి వారికోసమేనన్నట్టు శివమహా పురాణం విద్యేశ్వర సంహిత పద్నాలుగో అధ్యాయంలో దీనికి సంబంధించిన అనేక విషయాలున్నాయి. దేవతల ప్రీతి కోసం అయిదు రకాలైన పూజ ఏర్పడింది.
మంత్రాలతో జపం, హోమం మరియు దానం, తపస్సు, సమారాధనలు అనేవే అయిదు విధాలు. సమారాధనం అంటే దేవుడి ప్రతిమ నుంచి వచ్చే వేదిక. ప్రతిమ మరియు అగ్ని, లేక బ్రాహ్మణుడిని షోడశోపచారాలతో పూజించటం ఈ నాలుగు రకాలలో ఒక దానికంటే ఒకటి చాలా ఉత్తమమైనది. మనకున్న ఏడు వారాలలో ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవతకు పూజ చెయ్యాల్సి ఉంటుంది.
ఏ వారం ఏ పూజిస్తే కలిగే ఫలితాలు
ఆదివారం: ఆదివారం ఆదిత్యుడిని మరియు ఇతర దేవతలను, వేద పండితులను పూజించాలి. ఆదిత్య పూజ వల్ల నేత్ర సమస్యలు మరియు శిరోరోగం, కుష్ఠురోగం కూడా తగ్గుతాయి. ఆదిత్యుడిని పూజించి వేద పండితులకు భోజనం పెట్టాలి. ఇలా ఒక రోజు నుంచి ఒక మాసంమరియు ఒక సంవత్సరం లేదా మూడు సంవత్సరాల పాటు రోగ తీవ్రతననుసరించి పూజ చేయాలి. దీనివల్ల సూర్యానుగ్రహప్రాప్తి తప్పక కలుగుతుంది.
సోమవారం: సోమవారం సంపద కోరుకోనేవారు లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఆ రోజున పూజ తర్వాత వేద పండిత దంపతులకు నెయ్యితో తయారు చేసిన భోజనం పెట్టాలి.
మంగళవారం: మంగళవారం రోగాలు తగ్గటం కోసం కాళీదేవతను పూజించాలి. మినుము మరియు కంది, పెసరపప్పులతో చేసిన పదార్థాలతో వేద పండితులకు భోజనం పెట్టాలి.
బుధవారం: బుధవారం పెరుగు అన్నాన్ని మహా విష్ణువుకు నివేదించాలి. ఈ పూజ మరియు నివేదనల వల్ల పూజ చేసిన వారి కుమారులు, మిత్రులు మరియు భార్య తదితరులకు చక్కటి ఆరోగ్యం కూడా ప్రాప్తిస్తుంది.
ఏ వారం ఏ పూజిస్తే కలిగే ఫలితాలు
గురువారం: గురువారం ఆయుష్షును మరియు ఆరోగ్యాన్ని కోరేవారు తమ ఇష్టదైవం ఎవరైతే వారికి పాలతో మరియు నెయ్యితో చేసిన పదార్థాలను నివేదించాలి. వస్త్రాలను కూడా నివేదించి అర్చన చేయడం చాలా మేలు.
శుక్రవారం: శుక్రవారం కూడా ఇష్టదైవాన్ని శ్రద్ధతో ఆరాధించి భోగాలను పొందవచ్చును . ఆ రోజున పూజానంతరం వేదపండితుల తృప్తి కోసం షడ్రుచులతో కూడిన భోజనాన్ని పెట్టాలి. స్త్రీల సంతృప్తి కోసం మంచి మంచి వస్త్రాలను కూడా బహూకరించాలి.
శనివారం: శనివారం రోజున రుద్రాది దేవతల ఆరాధన చేయడం మంచిది. అపమృత్యువు నుంచి తప్పించుకోవాలనుకునేవారు ఆనాడు నువ్వులతో హోమం చేసి ఆ నువ్వులను దానం చేయాలి . నువ్వులు కలిపిన అన్నంతో పండితులకు భోజనం పెట్టాలి. ఇలా చేయటం వల్ల పూజ చేసిన వ్యక్తికి మంచి ఆరోగ్యం కూడా చేకూరుతుంది.
ఇలా ఏడు రోజులతో ఏ దేవతకు పూజ చేసినా ముందుగా సంతోషపడేది శివుడేనని శివపురాణం వివరిస్తోంది. ఆ వారాలకు సంబంధించిన దేవతల ఆనందమే తన ఆనందంగా శివుడు భావించుకొంటాడు. ఆ దేవతలే కాక శివుడే స్వయంగా ఆ భక్తులకు ఆ పూజాఫలాన్ని ప్రసాదిస్తాడు. సృష్టి ప్రారంభంలో ముల్లోకాల అభివృద్ధి కోసం పాప పుణ్యాలు రెండిటినీ శివుడు కల్పించాడు. పాపం చేయటం లేదా పుణ్యం చేయటమనేది మానవుల పూర్వజన్మ కర్మఫలాన్ని అనుసరించి ఉంటుంది. చేస్తున్నది పాపమని పెద్దలు లేదా గురువుల నుంచి తెలుసుకొని ఆ పాపకార్యాలను విడిచిపెట్టి పుణ్య సంపాదన కోసం మనిషి ప్రయత్నం చేయాలి. ఈ క్రమంలోనే కర్మఫలాన్ని అనుసరించి వచ్చిన కొన్ని రోగాలను మరియు కష్టాలను తప్పించుకోవడం కోసం పూజలు రూపొందాయి. ఈ విషయాన్ని గ్రహించి ఎవరు ఏ ఫలితం కావాలనుకొంటే ఆ రోజున ఆ పూజ చేసుకోవచ్చన్నది శివపురాణం ఇస్తున్న సూచన ఇదే .
No comments