భారతదేశం యొక్క జాతీయ చిహ్నాలు వాటి పూర్తి వివరాలు
సూర్యోదయం తరువాతనే జాతీయ పతాకాన్ని ఎగురవేయాలి. సూర్యాస్తమయానికి ముందే తొలగించాలి. జాతీయ పతాకం లేదా దాని ఫొటోని చించడం, మురికిచేయడం వంటివి చేయకూడదు. జాతీయ పతాకంను వ్యాపార ప్రకటనలకు వాడరాదు . జెండాను వస్త్రాలుగా కూడా ధరించకూడదు.
జాతీయ జెండాను ఎలా పడితే అలా వాడకుండా ప్రభుత్వం 1950లో ప్రివెన్షన్ ఆఫ్ ఇంప్రోపర్ యూజ్ యాక్ట్, 1971లో ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టూ నేషనల్ హానర్ యాక్ట్లను తయారు చేసింది. ఇందులో జెండా ను ఎప్పుడు, ఎందుకు, ఎవరు, ఎలా వాడాలి అనే నిబంధనలు కూడా పొందుపరిచారు. అయితే 2002లో వచ్చిన న్యూ ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం పౌరులందరూ అన్ని రోజులూ ఇళ్లు, కార్యాలయాలలో జెండాను ఎగురవేయవచ్చు. ఆర్టికల్ 19 (1) (ఎ) ప్రకారం జాతీయ పతాకాన్ని ఎగురవేయడం భారత పౌరుల ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు పేర్కొంది.
జాతీయ చిహ్నం:
లయన్ క్యాపిటల్ [సింహ తలాటం] అనేది భారతదేశ యొక్క జాతీయ చిహ్నం . దీనిని 1950 జనవరి 26న సారనాథ్లోని అశోకుని ధర్మస్థూపం నుంచి తీసుకున్నారు . ఈ చిహ్నంపై నాలుగు సింహాలు ఉంటాయి. అయితే మనకు మూడు సింహాలు మాత్రమే కనిపిస్తాయి. అలాగే పీఠంపై ముండకోపనిషత్నుంచి స్వీకరించిన వాక్యం ‘సత్యమేవ జయతే’ . ఇది దేవనాగరి లిపిలో రాసి ఉంటుంది. పీఠం మధ్య భాగంలో ధర్మచక్రం కూడా ఉంటుంది. ఈ చక్రానికి ఎడమ వైపు గుర్రం, కుడి వైపు ఎద్దు కూడా ఉంటాయి. పీఠం మరోవైపు ఏనుగు, సింహం కూడా ఉంటాయి.
జాతీయగీతం:
జనగణమణ మన జాతీయ గీతం . దీనిని విశ్వకవి, భారత తొలి నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించారు. రవీంద్ర నాథ్ రచించిన పూర్తి గీతంలో 5 చరణాలున్నాయి. ఈ గీతం లోని తొలి చరణంలోని 5 లైన్లను జాతీయ గీతంగా కూడా ఆమోదించారు. జాతీయ గీతాన్ని పూర్తిగా పాడటానికి 52 సెకన్ల సమయం పడుతుంది. 1885 కోల్కతాలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఈ గీతాన్ని ఆమోదించారు. తొలిసారిగా 1911, డిసెంబర్ 27న కోల్కతా కాంగ్రెస్ సమావేశంలో పాడారు. ఠాగూర్ తత్వబోధిని పత్రికలో భారత విధాత పేరుతో ఈ గీతం తొలిసారిగా 1912సంవత్సరం లో ప్రచురితం అయింది. ఠాగూర్ జనగణమణను మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా పేరుతో 1919 లో ఆంగ్లంలోకి కూడా అనువదించారు. జనగణమణ జాతీయ గీతం జనవరి 24 1950 సంవత్సరం నుంచి అధికారికంగా వాడుకలోకి వచ్చింది.
జాతీయ గేయం:
వందేమాతరం మన జాతీయ గేయం . దీనిని బంకించంద్ర చటర్జీ బెంగాలీలో రాసిన ‘ఆనంద్మఠ్’ అనే నవల నుంచి గ్రహించారు. ఆనంద్మఠ్ నవల 1982లో ప్రచురింపబడింది. ఈ గేయాన్ని 1896లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తొలిసారిగా పాడారు. అరవింద ఘోష్ దీనిని ఆంగ్లంలోకి కూడా అనువదించారు. వందేమాతరం గేయాన్ని జనవరి 24, 1950లో మన రాజ్యంగ సభ జాతీయ గేయంగా కూడా ఆమోదించింది.
భారతదేశం యొక్క జాతీయ చిహ్నాలు వాటి పూర్తి వివరాలు
జాతీయ ప్రతిజ్ఞ:
పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు ‘భారత దేశము నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు…’అనే ప్రతిజ్ఞను రచించారు. సుబ్బారావు విశాఖపట్నం ట్రెజరీ అధికారిగా ఉన్నపుడు 1962 సంవత్సరంలో ఈ ప్రతిజ్ఞ తయారు చేశారు. దీనిని ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు తెన్నేటి విశ్వనాథం దృష్టికి తీసుకెళ్లగా, ఆయన అప్పటి విద్యాశాఖ మంత్రి పీవీజీ రాజుకు అందచేశారు. 1964లో బెంగళూరులో ప్రముఖ న్యాయ నిపుణుడు మహ్మద్ ఖరీం చాగ్లా అధ్యక్షతన జరిగిన కేంద్రీయ విద్యా సలహామండలి సమావేశంలో జాతీయ ప్రతిజ్ఞగా స్వీకరించి ఇతర భాషల్లోకి అనువాదం కూడా చేయించారు. 1963 సంవత్సరంలో విశాఖపట్నంలోని ఒక పాఠశాలలో తొలిసారిగా ప్రతిజ్ఞ చేయించగా 1965 సంవత్సరం జనవరి 26 నుంచి దేశవ్యాప్తంగా కూడా అమల్లోకొచ్చింది.
జాతీయ పక్షి:
నెమలి భారత జాతీయ పక్షి . దీని యొక్క శాస్త్రీయ నామం పావో క్రిస్టేటన్. 1964సంవత్సరంలో భారత ప్రభుత్వం నెమలిని జాతీయ పక్షిగా గుర్తించింది. 1972 సంవత్సరంనుంచి నెమలిని వేటాడటం కూడా నిషేధించారు.
జాతీయ పుష్పం:
తామర పువ్వు లేదా కమలం జాతీయ పుష్పం. దీని యొక్క శాస్త్రీయ నామం నిలుంబో నూసిఫెరా గెర్టాన్. కమలం దైవత్వం, స్వచ్ఛత, జ్ఞానం, సంపదకూ కూడా ప్రతీక. ఇది జలాశయాలలో బురద, నాచుల మధ్య కూడా పెరుగుతుంది.
జాతీయ వృక్షం:
మర్రి చెట్టు జాతీయ వృక్షం. దీని యొక్క శాస్త్రీయ నామం ఫైకస్ బెంగాలెన్సిస్. దీనికి భారత సాహిత్యం, వైద్య శాస్త్రంలో ఎనలేని ప్రాధాన్యం ఉంది. మర్రి చెట్టు యొక్క ప్రస్తావన పురాణాలు, ఇతిహాసాలలో కూడా ఉంది.
మహబూబ్ నగర్ జిల్లాలోని పిల్లలమర్రి చెట్టు 800 సంవత్సరాలనాటిది. 330 మీటర్ల మేర విస్తరించి ఉన్న కలకత్తా మర్రి 450 సంవత్సరాలనాటిది. 1989లో అనంతపురం జిల్లా తిమ్మమ్మమర్రి గిన్నీస్ బుక్ రికార్డుల్లో చేరింది. అలెగ్జాండర్ దండయాత్రకు వచ్చినపుడు ఏడు వేల సైన్యంతో ఒకే మర్రి చెట్టుకింద విడిది ఏర్పాటు చేసుకున్నాడు.
భారతదేశం యొక్క జాతీయ చిహ్నాలు వాటి పూర్తి వివరాలు
జాతీయ జంతువు:
రాయల్ బెంగాల్ టైగర్ (పెద్దపులి) జాతీయ జంతువు . ఇది కేవలం భారత ఉపఖండంలోనే కనిపిస్తుంది. దీని యొక్క శాస్త్రీయ నామం పాంథారా టైగ్రిస్ (లిన్నెయస్). దీనిని 1972సంవత్సరంలో జాతీయ జంతువుగా గుర్తించారు. 1972 సంవత్సరం వరకు సింహం జాతీయ జంతువుగా ఉండేది. 1973 సంవత్సరం నుంచి ప్రాజెక్టు టైగర్ అనే పులుల సంరక్షణ పథకాన్ని కూడా చేపట్టారు. పులి అనేది శక్తికి , దైర్యానికి కూడా ప్రతీకగా భావిస్తారు .
జాతీయ ఫలం:
మామిడి పండు జాతీయ ఫలం . దీని యొక్క శాస్త్రీయ నామం మ్యాంజిఫెరా ఇండికా. ఈ ఫలానికి భారతీయ సంస్కృతితో ఎనలేని సంబంధం కూడా ఉంది. మన దేశంలోనే వందకు పైగా రకాల మామిడిపళ్లు కూడా దొరుకుతాయి. మామిడిని ప్రపంచంలో అత్యధికంగా మన దేశమే సాగు చేస్తుంది. ఎ, సి, డి విటమిన్లు పుష్కలంగా ఉండే మామిడి పండు, కాయ, ఆకు కూడా భారతీయులకు ఎంతో ముఖ్యమైనవి. బీహార్లోని దర్భాంగాలో మొఘల్ చక్రవర్తి అక్బర్ లక్ష మామిడి చెట్లను కూడా నాటించాడు. ప్రస్తుతం ఆ తోటను లఖీబాగ్గా కూడా పిలుస్తున్నారు.
జాతీయ క్రీడ:
హాకీ జాతీయ క్రీడ .ఒలింపిక్స్లో 1928 సంవత్సరం నుంచి 1956 సంవత్సరం వరకు వరుసగా ఆరు సార్లు మన దేశమే హాకీ చాంపియన్గా కూడా నిలిచింది. దీంతో అప్పటినుంచి హకీ జాతీయ క్రీడగా ఉంది. అయితే హాకీ నిజంగా మన జాతీయ క్రీడ కాదు. ఐశ్వర్య అనే పదేళ్ల బాలిక సమాచార హక్కు చట్టం కింద 2012సంవత్సరంలో కోరగా హాకీకి జాతీయ క్రీడ హోదా లేదని కేంద్రం కూడా తెలిపింది. భారత హాకీ క్రీడాకారుడు ద్యాన్చంద్ పుట్టిన రోజు ఆగస్టు 29ని జాతీయ క్రీడా దినోత్సవంగా కూడా జరుపుకుంటారు.
జాతీయ నది:
గంగానది జాతీయ నది. దేశంలో అత్యంత పొడవైన గంగానదిని 2008 నవంబర్ 5న జాతీయ నదిగా కూడా ప్రకటించారు. హిమాలయాల వద్ద గంగోత్రిలో భగీరథి పేరుతో పుట్టి, గంగగా కాశీ మొదలైన ప్రదేశాలలో 2,525 కిలోమీటర్ల మేర ప్రవహించి, పద్మ అనే పేరుతో బంగ్లాదేశ్కు వెళ్తుంది. గంగా నది హిందూవులకు ఎంతో పవిత్రమైనది. అలకనంద, యమున, సోన్, గోమతి, కోసి, గాఘ్రా నదులు గంగానదిలో కలుస్తాయి. 2016 జూలై 7న గంగానదిని శుభ్ర పరచడానికి నమామి గంగే మిషన్ను ప్రారంభించారు.
జాతీయ జలచరం(అక్వాటిక్ యానిమల్):
డాల్ఫిన్ ను కేంద్ర ప్రభుత్వం 2009 సంవత్సరం అక్టోబరులో జాతీయ జలచరంగా గుర్తించింది. దీని యొక్క శాస్త్రీయ నామం ప్లాటినెష్టా గాంజెటికా. డాల్ఫిన్ను భారత వన్యప్రాణి సంరక్షణా చట్టం 1972లోని షెడ్యూల్-1లో కూడా చేర్చారు. జాతీయ జంతువు, జాతీయ పక్షి, జాతీయ జలచరం వంటి వాటిని హింసించడం, చంపడం వన్యప్రాణి సంరక్షణా చట్టం 1972 ప్రకారం పెద్ద నేరం.
భారతదేశం యొక్క జాతీయ చిహ్నాలు వాటి పూర్తి వివరాలు
జాతీయ కరెన్సీ- రూపాయి
కరెన్సీ మీద దేవనాగరి లిపిలో ముద్రించిన ‘ర’ అనే అక్షరమే భారత జాతీయ కరెన్సీ చిహ్నం. 2010 సంవత్సరం జులై 15న జాతీయ కరెన్సీగా భారత ప్రభుత్వం గుర్తించింది.
జాతీయ భాష:
భారత ప్రభుత్వం1950సంవత్సరంలోఆర్టికల్ 343 ప్రకారం దేవనాగరి లిపిలో ఉన్న హిందీని జాతీయ భాషగా ప్రకటించింది.
జాతీయ వారసత్వ జంతువు
ఏనుగు మన జాతీయ వారసత్వ జంతువు . 2010సంవత్సరంలో ఏనుగును వారసత్వ జంతువుగా ప్రకటించారు.
జాతీయ పంచాంగం:
చైత్ర మాసంతో మొదలై ఫాల్గుణ మాసంతో ముగిసే శక యుగం పంచాంగాన్ని మన ప్రభుత్వం 1957సంవత్సరం మార్చి 22న జాతీయ పంచాంగంగా గుర్తించింది. అంతకు ముందు గ్రెగారియన్ కేలండర్ అమలులో ఉండేది. ఇందులో 365 లేదా 366 రోజులు ఉంటాయి. ఇప్పుడు గ్రెగారియన్ కేలండర్తో పాటు దేశీయ కేలండర్ను కూడా భారత్ గెజెట్, ఆకాశవాణి, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణకు కూడా ఉపయోగిస్తున్నారు.
జాతీయ కాలమానం
భారత జాతీయ కాలమానాన్ని 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అనుసరించి నిర్ణయిస్తారు.భారత కాలమానం గ్రీనిచ్ కాలమానం కంటే 5.30 గంటలు ముందు ఉంటుంది.
No comments
Post a Comment