భోజనం యొక్క సదాచార నియమాలు
1. భోజనానికి ముందు మరియు తరువాత తప్పక కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. తడికాళ్ళను తుడుచుకుని భోజనానికి కూర్చోవాలి.
2. తూర్పు మరియు ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం చాలా మంచిది.
3.తినే పళ్ళానికి ఆహార పదార్థాలు(కూర, పప్పు, పచ్చళ్ళు, మొ.) తాకించరాదు. అలా చేస్తే అవి ఎంగిలి అవుతాయి. ఆ ఎంగిలి పదార్థాలు ఎవ్వరికీ పెట్టరాదు. ఆలా చేస్తే చాలా దోషం.
4. అన్నపు పాత్రలో నేతి గిన్నెను పెట్టి కాచడం చేయరాదు. నేతిలో మెతుకులు పడరాదు.
5. భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో లేవరాదు.
6. ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని కూడా చూపించకూడదు మరియు తాకరాదు.
భోజనం యొక్క సదాచార నియమాలు
7. తినే కంచాన్ని ఎడమచేతితో ముట్టుకోకూడదు. ఒకవేళ కంచాన్ని ముట్టుకుంటే ఆ వెంటనే ఎడమచేతితో నీటిని ముట్టుకోవాలి.
8. సొట్టలు ఉన్న కంచం మరియు విరిగిన కంచం భోజనము చేయడానికి పనికిరాదు.
9. అన్నం నిలబడి తింటూ ఉంటే క్రమంగా దరిద్రులు అవుతారు.
10. ఉపనయనం అయినవారు తప్పక ఆపోశనము పట్టి గాయత్రీ మంత్రంతో ప్రోక్షణ చేసుకుని భోజనం చేయాలి. భోజనం ఉపనయనం కాని వారు భగవన్నామము ఉచ్చరించి చేయాలి.
11. అన్నం తింటున్నప్పుడు వంట బాగాలేదని దూషించడం చేయరాదు. కోపముతో అన్నం పెట్టేవారిని తిట్టడం చేయరాదు.
12. ఆపోశనము అయ్యాక ఉప్పు వడ్డించుకోకూడదు. ఏవైనా పదార్థాలలో ఉప్పు తక్కువైతే ఆ పదార్థాలు ఉన్న గిన్నెలలో ఉప్పు వేసుకుని వడ్డించుకోవాలి.
13. కంచం ఒడిలో పెట్టుకుని భోజనం చేయకూడదు. పడుకునే మంచం మీద భోజనం చేయరాదు. (ఇది వృద్ధులకు, అనారోగ్యం ఉన్నవారికి వర్తించదు.)
14. మాడిన అన్నాన్ని నివేదించకూడదు. మరియు ఆ అన్నాన్ని అతిథులకు పెట్టకూడదు.
15. క్షురకర్మను భోజనం అయ్యాక చేసుకోరాదు. (వెంట్రుకలు కత్తిరించడం).
భోజనం యొక్క సదాచార నియమాలు
16. గురువులు లేదా మహాత్ములు ఇంటికి వస్తే మనం తినగా మిగిలినవి పెట్టకూడదు. మళ్ళీ వారి కోసం ప్రత్యేకంగా వంటచేయాలి.
17. భోజనం వడ్డించేటప్పుడు పంక్తిబేధం చూపకూడదు. అనగా ఒకరికి ఎక్కువ వడ్డించడం మరొకరికి తక్కువ వడ్డించడం చేయరాదు.
18. భోజనం చేస్తున్నప్పుడు తింటున్న పదార్థాలలో వెంట్రుకలు మరియు పురుగులు వస్తే తక్షణం దానిని విడిచిపెట్టాలి.
19. వడ్డన పూర్తి అయ్యాక విస్తరిలో లేదా కంచంలో ఆవునెయ్యి వేసుకుంటే ఆహారం శుద్ధి అవుతుంది.
20. భగవన్నామము తలుచుకుంటూ లేదా భగవత్ కథలు వింటూ వంట వండడం మరియు భోజనం చేయడం చాలా ఉత్తమం.
21. ఉపాసకులను మరియు ఏదైనా దీక్షలో ఉన్నవారిని ఎక్కువగా తినమని బలవంతపెట్టకూడ దు. ( అతిగా ఆహారం స్వీకరిచడం వారి అనుష్ఠానానకి ఇబ్బంది అవ్వచ్చును ).
భోజనం యొక్క సదాచార నియమాలు
22. భోజనం చేస్తున్నవారు (అనగా భోజనం మధ్యలో తింటూ) వేదం చదువకూడదు.
23. గిన్నె మొత్తం ఊడ్చుకుని తినకూడదు. తినే ఆహార పదార్థాలను కాళ్ళతో తాకరాదు.
24. భోజనం చేస్తున్నప్పుడు నీళ్ళ పాత్రను కుడివైపు తప్పక ఉంచుకోవాలి.
25. స్త్రీలు బహిష్టు కాలంలో వంట వండరాదుమరియు వడ్డించరాదు. వారు ఆ 4 రోజులు ఎవరినీ తాకకూడదు. వడ్డన సమయంలో వారు అక్కడ ఉండరాదు.
26. అరటి ఆకుల వంటి వాటిలో భోజనం చేసిన వ్యక్తి వాటిని మడవరాదు (తిన్న విస్తరిని మడవడం అనాచారం). ఆ ఇంటిలో ఒక్కడు ఉన్నప్పుడు ఈ నియమం వర్తించదు.
27. ఎంగిలి విస్తరాకులను తీసేవాడికి వచ్చే పుణ్యం అన్నదాత కు కూడా రాదని మన శాస్త్రం. (జగద్గురువైన శ్రీ కృష్ణుడు కూడా ధర్మరాజు చేసిన రాజసూయయాగం లో లక్షలాది మంది తిన్న ఎంగిలి ఆకులు ఎత్తాడని మహాభారతం కూడా చెబుతోంది.)
28. భోజనం అయ్యాక రెండుచేతులూ మరియు కాళ్ళూ తప్పక కడుక్కోవాలి. అవకాశం లేనప్పుడు రెండు చేతులైనా తప్పక కడుక్కోవాలి. నీటితో నోరు అయినా పుక్కిలించుకోవాలి.
భోజనం యొక్క సదాచార నియమాలు
29. భోజనం అయ్యాక నేలను లేదా బల్లను శుద్ధి(మెతుకులు తీసేసి,తిన్న చోట తడిగుడ్డతో శుభ్రం) చేసిన తరువాత మాత్రమే అక్కడ వేరేవారికి భోజనం వడ్డించాలి.(ఇప్పటికీ సదాచారాలు పాటించే వారు ఇళ్ళల్లో గోమయం లేదా పసుపు నీళ్ళు చల్లి మరీ శుద్ధి చేస్తారు.)
30. స్నానం చేసి మాత్రమే వంట వండాలని కఠోర నియమము ఉంది . పెద్దలు,సదాచారపరులు హోటళ్ళలో మరియు ఎక్కడంటే అక్కడ భోజనం చేయకపోవడానికి ఇదే ఒక ముఖ్యకారణం. అక్కడ వంట చేసే వారు స్నానం చేసారో లేదో తెలియదు.
పాచిముఖంతో వంట చేసినా, రోడ్డు మీద తిరిగే చెప్పులు ధరించి వంటచేసినా చాలా దోషం. అవి తిన్న వారికి మెల్లగా వారి మనసుపై ప్రభావం కూడా చూపుతుంది. వచ్చే పుణ్యం కూడా క్షీణిస్తుంది.
31. ఒకసారి వండాక అన్నము మరియు కూర, పప్పు వంటి ఇతర ఆహార పదార్థాలను మళ్ళీ వేడి చేసి తినకూడదు. ద్విపాక దోషం కూడ వస్తుంది.
32. ఆడవారు గాజులు ధరించకుండా భోజనం చేయరాదు మరియు వడ్డించకూడదు.
No comments